Friday, April 19, 2024
Friday, April 19, 2024

న్యాయంపై నమ్మకం కలిగింది

భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికైత్‌
ఆశీశ్‌మిశ్రా బెయిల్‌ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ..ఈ కేసులో న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని రైతులకు కలిగించిందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికైత్‌ సోమవారం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికైనా బాధిత రైతులకు భద్రత కల్పించడం, నష్టపరిహారం చెల్లించడం, న్యాయం చేయడంపై దృష్టిసారించాలని తికైత్‌ డిమాండ్‌ చేశారు. మంత్రి కొడుకు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం…న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని రైతులకు కలిగించినట్లు అయింది. అమాయక రైతులను జైలు నుంచి విడిచిపెట్టాలి. పూర్తిస్థాయి న్యాయం జరిగేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తాం’ అని ఆయన స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img