Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

న్యాయవ్యవస్థ పైనా పాలక బీజేపీ దాడి : రాహుల్‌గాంధీ

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌ ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు అయిన రాహుల్‌గాంధీ శ్రీనగర్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనకు నిన్న సాయంత్రం ఇక్కడకు వచ్చిన రాహుల్‌ జమ్ము కశ్మీర్‌లో స్వేచ్ఛగా,నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. శ్రీనగర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడుతూ, పార్లమెంట్‌, అసెంబ్లీ వంటి చట్టసభలతో పాటు న్యాయవ్యవస్ధపైనా పాలక బీజేపీ దాడి చేస్తోందన్నారు. మీడియా గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు.అంతకుముందు రాహుల్‌ ఖిర్‌ భవానీ ఆలయం, హజ్రత్‌బల్‌ మసీదును సందర్శించారు. శ్రీనగర్‌లో నిర్మించిన కాంగ్రెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ భవనాన్ని ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img