ప్రముఖ కవి సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు దిల్లీలోని విశ్రమ్ ధామ్ మందిరాన్ని సందర్శించారు. మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మందిరంలోని భక్తులతో కొంతసేపు మాట్లాడారు. విశ్రమ్ ధామ్ మందిరంలో నిర్వహించిన ‘షాదాబ్ కీర్తన్లో మోదీ పాల్గొన్నారు. సంప్రదాయ వాద్య పరికరాన్ని చేతిలో పట్టుకొని భజనలో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కీర్తనలు ఆలపించారు. ఈ వీడియోను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ‘ప్రత్యేక క్షణాలు’ అని రాసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. గురు రవిదాస్ జయంతి పంజాబ్ దళితుల ప్రముఖ పండుగ. రవిదాస్ జయంతిని పురస్కరించుకునే ఈ ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20కి మార్చారు.