ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ లీక్ కేసులో ఇప్పటికే అభిషేక్ బచ్చన్ను విచారించిన ఈడీ తాజాగా ఆయన భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్కు నోటీసులు జారీచేసింది. ఇవాళ దిల్లీలోని లోక్నాయక్ భవన్లో తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ ఐశ్వర్యారాయ్ ఢల్లీిలోని లోక్నాయక్ భవన్లో ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు.కాగా, ఈ కేసులో ఐశ్వరాయ్ బచ్చన్ను ప్రశ్నించేందుకు ఇప్పటికే పశ్నల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. పనామా పేపర్ లీక్ కేసులో 500 మంది భారతీయులకు ప్రమేయం ఉన్నది. వారిలో రాజకీయ నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు తదితరుల పేర్లు ఉన్నాయి. వీరంతా ప్రభుత్వానికి పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ దర్యాప్తులో పాల్గొంటున్నారు. పనామా పేపర్ లీక్ కేసులో చాలాకాలంగా దర్యాప్తు జరుగుతున్నది. గత నెల ఐశ్వరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఈ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన నుంచి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈడీ ఐశ్వర్యరాయ్కు ఈడీ నోటీసులు పంపడం.. బాలీవుడ్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ వెలుగులోకి వచ్చిన రహస్య పత్రాలు కలకలం రేపుతున్నాయి.