Friday, April 19, 2024
Friday, April 19, 2024

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..పదిమంది మృతి
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెంకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ వంతెన రెయిలింగ్‌ను ఢీకొని వాగులో పడిరది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదిమంది మృతిచెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిరచారు. బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులను పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఘటనాస్థలిలో ఆర్డీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img