Friday, April 19, 2024
Friday, April 19, 2024

పాదయాత్రలంటే సీఎంకు ఎందుకంత కోపం…: నారాయణ

రాజధాని రైతుల అమరావతి నుంచి అరసవిల్లి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. పాదయాత్రలు, ర్యాలీలు అంటే ముఖ్యమంత్రికి ఎందుకు కోపం? అని ప్రశ్నించారు. మీరు, మీ నాన్న (వైఎస్‌) పాదయాత్రలు చేసే కదా ముఖ్యమంత్రులైంది? అంటూ సీఎం జగన్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతులు పాదయాత్రను ఎందుకు చేస్తున్నారో గమనించాలని హితవు పలికారు. వారేమీ మిమ్మల్ని (సీఎం జగన్‌) ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని పాదయాత్ర చేయడంలేదని, అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టారని అన్నారు. ఏదేమైనా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గుణం మారిపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉంటుందని హామీ ఇచ్చిన జగన్‌.. సీఎం అయ్యాక మాట మార్చారన్నారు. ఇప్పుడు చేపడుతున్న పాదయాత్ర అమరావతి రైతులు చేపడుతున్న రెండో పోరాటం అని నారాయణ అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img