Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పార్టీ మారే ఆలోచనే లేదు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తనకు పార్టీ మారే ఆలోచనే లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ వస్తున్న ప్రచారాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల కోసమే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఉద్దేశ పూర్వకంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకవేళ పార్టీ మారే ఆలోచన ఉంటే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనప్పుడే మారేవాడినని వెల్లడించారు. కాంగ్రెస్ ను వీడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని.. తనది కాంగ్రెస్ రక్తమన్నారు. తనకు నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img