విచారణ జరిపించాలన్న రాకేశ్ తికైత్
నోయిడా: పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ రద్దవడానికి కారణమేంటో విచారణ జరిపించాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికైత్ కోరారు. భద్రతలో లోపం జరిగిందా లేదా ఆయన కార్యక్రమం మార్చబడిరదా లేదా రైతుల నిరసన కారణంగానే జరిగిందా అనే విషయం తేలాల్సి ఉందని తికైత్ అభిప్రాయపడ్డారు. ‘ప్రధాని భద్రతా లోపం వల్లే ర్యాలీ రద్దయిందని బీజేపీ వారు చెబుతుండగా, ర్యాలీలో జనంలేక ఖాళీ కుర్చీలు ఉన్నందునే ప్రధాని వెనక్కు వెళ్లిపోయారని పంజాబ్ ముఖ్యమంత్రి చెబుతున్నారు. భద్రతలో లోపమా లేక రైతుల ఆగ్రహావేశాలు కారణమా అనే దానిపై ఇప్పుడు విచారణ అవసరం’ తికైత్ హిందీలో ట్వీట్ చేశారు.