ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ఈపీఎఫ్ఓ) సంస్థ 2021
22 ఆర్థిక సంవత్సరానికిగానూ పీఎఫ్ వడ్డీరేటును 40ఏళ్ల కనిష్టానికి తగ్గించింది. ప్రస్తుతం 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 8.1 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది.వడ్డీ రేట్ల విషయమై చర్చించేందుకు గాను శనివారం ఈపీఎఫ్ఓ నిర్ణయ మండలి బోర్డు గువహటిలో సమావేశమైంది. ఈ సమావేశంలో పీఎఫ్ వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.8.1 శాతం వడ్డీ రేటు నిర్ణయాన్నీ సీబీటీ కేంద్ర ఆర్థికశాఖకు పంపనుంది. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే చందాదారులకు వడ్డీ జమ చేయనున్నారు.ఇదిలా ఉంటే 1977-78 తర్వాత ఇంత తక్కువ వడ్డీ రేటు ఇవ్వడం ఇదే తొలిసారి కానుంది. ఆ ఏడాది 8 శాతం వడ్డీ ఇవ్వగా, అనంతరం పెంచుతూ 2015-16 నాటికి 8.8 శాతానికి తీసుకొచ్చారు. అయితే కరోనా సమయంలో వడ్డీ రేట్లను 8.5 శాతానికి తగ్గించారు. ఇప్పుడు మరోసారి భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.