Friday, April 19, 2024
Friday, April 19, 2024

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా గురువారం దిల్లీలో రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన తెలిపారు. పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. గత 10 రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 9 సార్లు పెంచారని చెప్పారు. పెరిగిన ధరలపై కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు అధిర్‌ రంజన్‌ చౌదరి, మల్లికార్జున్‌ ఖర్గే, అభిషేక్‌ సింఫ్వీులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇంధన ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయని తాము ముందే చెప్పామని కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు.ఇంధనం, ఎల్‌పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా గురువారం రాహుల్‌ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్‌ ఖర్గే చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img