Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు..రెండు రోజుల మాక్‌ డ్రిల్‌ చేపట్టిన కేంద్ర ఆరోగ్య శాఖ

కేసుల వెనుక ఒమిక్రాన్‌ సబ్‌-వేరియంట్‌ ఎక్స్‌బీబీ1.16
మరోసారి కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సోమ, మంగళవారాల్లో కోవిడ్‌ సన్నద్ధతపై మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో అత్యవసర సంసిద్ధతను సమీక్షించడానికి ఈ డ్రిల్‌ చేపట్టారు. హరియాణా రaజ్జర్‌లోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌)లో మాక్‌ డ్రిల్స్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా పర్యవేక్షించనున్నారు. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు అప్రమత్తంగా ఉండాలని, తమ తమ రాష్ట్రాలలో ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను తనిఖీ చేయాలని కేంద్ర మంత్రి కోరారు.కొత్త వేరియంట్‌లతో సంబంధం లేకుండా ‘టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-వ్యాక్సినేషన్‌, కోవిడ్‌ నిబంధనల పాటించడం’ అనే ఐదెంచల వ్యూహాన్ని అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరోనా ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ సరఫరా, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లు అమలులో ఉన్నాయని, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని ఆయన అన్నారు. కోవిడ్‌ నాలుగో వేవ్‌కు అవకాశం ఉంది కాబట్టిప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంలోని చాలా చోట్ల కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి తప్పనిసరి మాస్క్‌ సహా కరోనా నిబంధనలు అమలు చేస్తున్నాయి. హరియాణా, కేరళ, ఢల్లీి, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు మాస్క్‌ నిబంధనలు మళ్లీ అమల్లోకి తీసుకొచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img