Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోలవరం ఎత్తు తగ్గించొద్దు

. నిర్వాసితులకు పరిహారమివ్వాలి
. నీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలి
. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుకు సీపీఐ నేత విల్సన్‌ వినతి

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: వార్షిక బడ్జెట్‌ (202324)లో నీటి పారుదల రంగానికి 15శాతం నిధులు కేటాయించి పూర్తిగా ఖర్చుచేయాలని, పోలవరాన్ని ఎత్తు తగ్గించకుండా, ప్రతిపాదిత ఎత్తుతో నిర్మించాలని, నిర్వాసితులకు పరిహారాన్ని ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ప్రకారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడ నీటి పారుదలశాఖ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబును ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. పోలవరం నిర్మాణం కేంద్రమే బాధ్యత వహించేలా ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు దిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకోవడానికి సీపీఐ రాష్ట్ర నాయకత్వం ఫిబ్రవరి 13 నుంచి 22 వరకు పర్యటించగా, తమ బృందం దృష్టికి అనేక సమస్యలు వచ్చాయని తెలుపుతూ…వాటిని మంత్రితో కలిసి జల్లి విల్సన్‌ చర్చించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలు, పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కోరగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సీపీఐ రాష్ట్ర నాయకత్వం తొమ్మిది రోజులపాటు ఈ మొత్తం ప్రాజెక్టులను పరిశీలించి వచ్చిన తర్వాత ఈనెల 5వ తేదీన రాజకీయ పార్టీలు, రైతుసంఘాలు, ప్రజాసంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి, ఈ క్రింద తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. పోలవ రాన్ని ఎత్తు తగ్గించకుండా ప్రతిపాదిత ఎత్తుతో నిర్మించాలని, నిర్వాసితులకు పరిహారాన్ని ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి ప్రకారం చెల్లించాలన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన…పోలవరాన్ని కేంద్రమే నిర్మాణ బాధ్యత వహించాలని, నిర్వాసితుల పరిహారం సవరించిన అంచనా ప్రకారం చేయాలన్నారు. అందుకు కేం ద్రంపై ఒత్తిడి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లాలన్నారు. ఎగువ తుంగభద్ర నిర్మాణం వల్ల టీబీ డ్యాం ద్వారా హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, కేసీ కెనాల్‌కు జరిగే నష్టాన్ని నివారించేందుకు కేంద్రం వద్ద సమర్థవంతమైన వాదనలు వినిపించి దాన్ని నిలిపివేయించాలన్నారు. గాలేరునగరి, సుజల స్రవంతి, తెలుగుగంగ, హంద్రీనీవా సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టుల క్రింద ఉన్న రిజర్వాయర్ల అసంపూర్తి పనులు ఈ ఏడాదిలో పూర్తి చేసి కరువు ప్రాంతాలను ఆదుకోవాలని కోరారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ది చేకూర్చే గుండ్రేవుల, వేదవతి, రాజోలి, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని, వంశధార, నాగావళి నదులపై ఉన్న రిజర్వాయర్లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే చింతల పూడి ఎత్తిపోతల పథకం ఫేజ్‌1, ఫేజ్‌2లో ఉత్పన్నమైన వివిధ భూ సేకరణ సమస్యల్ని పరిష్కరించి కాల్వల నిర్మాణం వెంటనే పూర్తి చేయల న్నారు. ఈ తీర్మానాల్ని క్రమేపీ పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి అంబటికి జల్లి విల్సన్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img