ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్
ఆర్మీ నియామకాలకు ‘కోవిడ్’ సెలవు 75 ఏళ్లలో తొలిసారి న్యూదిల్లీ : దేశంలో ఎన్నికలు ముగిసి వాటి ప్రభావం తగ్గిన మరుక్షణం నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు అమాంతం పెరిగిపోయాయి. తాజా ధరల పెంపుతో ఇప్పటికే ఇబ్బందుల్లో ప్రజలపై మరింత ప్రతికూల ప్రభావం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచేశాయి. ఎన్నికల నేపథ్యంలో నాలుగున్నర నెలల తర్వాత వీటి ధరలు పెరిగాయి. మంగళ
బుధవారాల్లో 80పైసలు చొప్పున లీటరు పెట్రోల్, డీజిల్పై పెరుగగా దిల్లీలో లీటరు పెట్రోల్ రూ.97.01కి, డీజిల్ రూ.96.21కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ రూ.111.67కి చేరుకోగా డీజిల్పై 85 పైసల పెంపుతో రూ.95.85కి పెరిగింది. పేదల ఇంధనం కిరోసిన్ ధర ప్రధాన నగరాల్లో రెట్టింపు అయింది. 2020 ఏప్రిల్తో పోల్చితే ఫిబ్రవరిలో కోల్కతా, ముంబైలో 104112శాతం ధర పెరిగింది. చెన్నైలో 10.3శాతం పెరిగింది. ఎల్పీజీ ధర పెంపుదల కారణంగా పేదలు కిరోసిన్ వినియోగానికి మొగ్గు చూపుతుండటంతో ప్రస్తుతం ధర మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, కోవిడ్ మహమ్మారి కారణంగా యుద్ధాలు, భారీ ఎన్నికల ర్యాలీలు ఆగలేదుగానీ 2020
22 ఆర్మీ నియామకాలకు దీర్ఘకాల సెలవు లభించింది. 75 ఏళ్లలో ఇలా ఎన్నడూ జరగలేదు. 201819లో 53,431 మందిని, 2019
20లో 80,572 మందిని ఆర్మీలో నియమించగా రెండేళ్లుగా ఎలాంటి నియామకాలు జరగలేదని పార్లమెంటుకు ప్రభుత్వం తెలిపింది. 2022, జనవరి 1కి ఆమోదిత నియామకాల సంఖ్య 12,12,000 కాగా 6.7శాతం అంటే 81,000 మంది కొరత ఉందని అంతకుముందు ఆర్మీ ప్రతినిధి ఒకరు పార్లమెంటరీ రక్షణ స్టాండిరగ్ కమిటీకి తెలిపారు. మరోవైపు ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొడుతోంది. ఈ సినిమా విడుదలైన హాళ్ల లోపల, బయట ముస్లింలపై హిందూత్వ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలు వైరలయ్యాయి. అయితే ఈ సినిమాలో వాస్తవాలు లేవని ప్రచారం కోసం తీసిందేనని కశ్మీర్కు చెందిన రాజకీయ ప్రముఖులు నొక్కి చెబుతున్న విషయం విదితమే.