Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మరో ఉద్యమం అవసరం : రాహుల్‌గాంధీ

క్విట్‌ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టును షేర్‌ చేశారు.క్విట్‌ ఇండియా ఉద్యమం లాంటి ‘డూ ఆర్‌ డై’ ఉద్యమం అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మరో ఉద్యమం అవసరం ఎంతైనా ఉందని..అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పెరిగిపోతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని దేశం నుంచి తరిమికొట్టాలన్నారు. నియంతృత్వ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ నివాళులు అర్పిస్తున్నట్టు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img