Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రతి సమస్యకూ నెహ్రూనే కారణమనడం ఎంతవరకు సమంజసం

: మన్మోహన్‌ సింగ్‌
ప్రధాని నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రతి సమస్యకూ నెహ్రూనే కారణమంటూ మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధాని పదవికి ఓ గౌరవం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మోదీకి చురకలంటించారు.రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ దేశాన్ని విభజించలేదని, ఎలాంటి నిజాలనూ దాచలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే ప్రజలను విడగొడుతున్నారని అన్నారు. తాను ప్రధానిగా ఉన్న పదేళ్లు.. చేతలతోనే మాట్లాడానని గుర్తు చేశారు. ప్రపంచం ముందు దేశ పరువు ఎన్నడూ తీయలేదన్నారు. ‘‘నేను నోరు లేనివాడినని, అవినీతి పరుడినని, బలహీనుడినని బీజేపీ, ఆ పార్టీ బీ, సీ టీమ్‌ లు ఆరోపించినా.. ఆ పార్టీల తీరేంటో ప్రజలకు తెలిసొస్తుండడం పట్ల నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక విధానాలపై అసలు అవగాహనే లేదన్నారు. ఇది కేవలం దేశానికి సంబంధించిన విషయమే కాదన్నారు. విదేశాంగ విధానాలపైనా ప్రభుత్వం విఫలమైందన్నారు. నేతలను కౌగిలించుకోవడం, చేతులు కలపడమే విదేశాంగ విధానం కాదని ప్రధాని తెలుసుకోవాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వ జాతీయవాదం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. విభజించు- పాలించు అన్న బ్రిటీష్‌ నియమాలనే బీజేపీ పాటిస్తోందన్నారు. రాజ్యాంగసంస్థలను బలహీనం చేశారని ఆరోపించారు. ప్రస్తుత ఆర్థిక విధానాల్లో స్వార్థం, దు:ఖం తప్ప ఏమీ లేదన్నారు. పంజాబ్‌ లో ప్రధాని భద్రతా లోపాల పైనా ఆయన స్పందిస్తూ,. భద్రత పేరిట పంజాబ్‌ సీఎం చరణ్‌ జిత్‌ సింగ్‌ చన్నీ, ఆ రాష్ట్ర ప్రజలను అవమానించే కుట్ర చేశారని అన్నారు. రైతు ఉద్యమ సమయంలోనూ పంజాబీలను దోషులుగా చూపించే కుట్ర చేశారని మండిపడ్డారు. పంజాబ్‌ నుంచి వచ్చిన నిజమైన భారతీయుడిగా ఆ విషయాలు తనను తీవ్రంగా బాధించాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img