భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. నరేంద్ర మోదీని పొరుగుదేశం భూటాన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం నగడగ్ పెల్ గి ఖోర్లో తో సత్కరించింది. భూటాన్ నేషనల్ డేను పురస్కరించుకుని ఈ అవార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని లటయ్ షెరింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భూటాన్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పేరును ఎంపిక చేయడం విని నేను చాలా సంతోషించాను’’ అని భూటాన్ దేశ ప్రధాని ట్వీట్ చేశారు.‘‘కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మోడీజీ అందించిన సహాయం, షరతులు లేని స్నేహం మరవలేనిది, భూటాన్ దేశ అత్యున్నత అవార్డుకు మోదీజీ అర్హులు, భూటాన్ ప్రజల నుంచి మోదీకి అభినందనలు. మోదీజీ గొప్ప మహనీయుడు, ఆధ్యాత్మిక మానవుడు. మోదీని వ్యక్తిగతంగా కలిసి వేడుక జరుపుకోవడానికి ఎదురు చూస్తున్నాం’’ అని భూటాన్ ప్రధాని కార్యాలయం నుంచి నేడు ప్రకటన విడుదల చేసింది.