పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. మూడోసారి బెంగాల్ సీఎం అయ్యాక మమత ప్రధానికి కలవడం ఇదే తొలిసారి. ఇటీవల పశ్చిమబెంగాల్ రాష్ట్ర ఎన్నికల్లో టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకున్నాక సీఎం మమతా మొదటిసారి ఢల్లీిలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం మమతా బెనర్జీ ఢల్లీి చేరుకున్నారు. 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి బాకీ ఉన్న నిధులను విడుదల చేయాలని మమతా కోరినట్లు సమాచారం.కరోనా టీకాలను కూడా అధిక మొత్తంలో విడుదల చేయాలని ఆమె అభ్యర్థించారు. ఇవాళ ఉదయం ఢల్లీిలో కాంగ్రెస్ నేత కమల్నాథ్ను ఆమె కలిశారు.రేపు సోనియాతోనూ మమతాబెనర్జీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.