మానస వారణాసికి కరోనా..మిస్ వరల్డ్ పోటీలు వాయిదా
ప్రపంచ సుందరి పోటీలపై కరోనా పంజా విసిరింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన పలువురికి కరోనా సోకింది. కరోనా వచ్చిన వారిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మానస వారణాసి కూడా ఉన్నారు. దీంతో పోటీలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ మేరకు నిర్వాహకులు మిస్ వరల్డ్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు.. ఫినాలే డిసెంబర్ 16వతేదీన ప్యూర్టోరికోలో జరగాల్సి ఉంది.కరోనా కారణంగా మిస్ వరల్డ్ 2021 ముగింపు పోటీలు తాత్కాలికంగా వాయిదా పడినాయి. అయితే పోటీదారులు, సిబ్బంది, సాధారణ ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రయోజనాల కారణంగా నిర్వాహకులు ఈవెంట్ను వాయిదా వేయాల్సి వచ్చింది. తదుపరి 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. మిస్ వరల్డ్ 2021 పోటీలకు వెళ్లిన మిస్ ఇండియా మానస వారణాసి సహా 17 మంది పోటీదారులు, సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన 23 ఏళ్ల మానస వారణాసి 70వ ప్రపంచ సుందరి పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది.2019వ సంవత్సరంలో జరిగిన పోటీల్లో జమైకా దేశానికి చెందిన టోనీ-ఆన్ సింగ్ మిస్ వరల్డ్ 2019 కిరీటాన్ని గెలుచుకుంది.