: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
ప్రభుత్వ రంగ బ్యాంకుల వార్షిక పని తీరును సమీక్షించామని..సమష్టిగా చాలా బాగా పని చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. స్వయం సమృద్ధ భారత్ ప్యాకేజీ, కోవిడ్-19 సంబంధిత ప్యాకేజీల అమలును సమీక్షించినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో నిర్మల సీతారామన్ బుధవారం ముంబైలో బుధవారం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా క్లీన్, స్మార్ట్ బ్యాంకింగ్ను వ్యవస్థీకరించేందుకు ఉద్దేశించిన సంస్కరణల ఎజెండాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి సమయంలో కస్టమర్ల అవసరాలు ఉన్నప్పటికీ, బ్యాంకుల విలీన ప్రక్రియకు ఎటువంటి విఘాతం కలగలేదన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) సమష్టిగా చాలా బాగా పని చేస్తున్నాయని.. మార్కెట్కు రాగలమని, నిదులను సేకరించగలమని ఈ బ్యాంకులు నిరూపించాయన్నారు.