ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా విస్తృత ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం చమటోడస్తున్నారు. అలహాబాద్ ఉత్తరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుగ్రహ నారాయణ్ సింగ్ తరపున శుక్రవారం ప్రియాంక రోడ్షో నిర్వహించారు. బమ్రాలీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రియాంక అక్కడి నుంచి రోడ్డు షో ప్రారంభించారు. ప్రియాంకపై స్థానికులు పూలవర్షం కురిపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆమె వెంట ఉన్నారు.