Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రశాంత్‌ కిషోర్‌ కొత్త పార్టీ ?

బీహార్‌ నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు పీకే ట్వీట్‌
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లే అని చెప్పకనే చెప్పారు. ఈ మేరకు సోమవారం ట్విటర్‌ వేదికగా తన భవిష్యత్‌ ప్రణాళికకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రజల కోసం నేరుగా నేరుగా పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ పేర్కొన్నారు. దీంతో పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు పీకే త్వరలోనే సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిని అయి, ప్రజానుకూల విధానాల రూపకల్పనలో సాయం చేయడంలో పదేళ్లు గడిచాయి. ఇప్పుడు నేరుగా ప్రజల దగ్గరకు చేరువకావాల్సిన సమయం వచ్చింది. వారి సమస్యల్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, జన సురాజ్‌కు బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆరంభం బీహార్‌? నుంచే..’’ అని ట్వీట్‌ చేశారు.
ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరతారనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆఖర్లో కీలక పదవికి కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి విముఖత వ్యక్తం కావడం, ప్రాధాన్యత లేని పదవిని కాంగ్రెస్‌ ఆయనకు ఆఫర్‌ చేయడంతో పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు రాజకీయ వ్యూహకర్తగా బీహార్‌లో నితీశ్‌కుమార్‌ను గద్దె ఎక్కించడంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్‌ కిషోర్‌. ఇప్పుడు అక్కడి నుంచే ప్రత్యక్ష రాజకీయాల ప్రకటన చేయడం గమనార్హం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై పీకే మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img