Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రారంభమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. లండన్‌లో భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్‌ ఖండిరచాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారత్‌లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందంటూ లండన్‌లో రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా చేయిస్తున్న దాడులు, అదానీ అక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ సమావేశాలు నేటి నుండి ఏప్రిల్‌ 6 వరకు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img