ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి గృహ నిర్బంధాన్ని ఉల్లంఘించిన ప్రియాంక గాంధీని హరగావ్లో పోలీసులు నిర్బంధించారు. స్థానిక గెస్ట్ హౌజ్లో ఆమెను నిర్బంధించారు. నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కారును పోనివ్వడంతో నలుగురు మరణించారు.ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ప్రియాంకగాంధీ సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు లఖింపూర్ ఖేరీకి బయలుదేరగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పీఏసీ గెస్ట్ హౌజ్లో ఉంచగా, ఆమె అక్కడ చీపురు అందుకుని ఆ గదిని శుభ్రం చేశారు. ఆ తర్వాత ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. గెస్ట్హౌజ్ రూమ్ శుభ్రంగా లేదని, అందుకే ఆమె ఆ రూమ్ను క్లీన్ చేసినట్లు కొందరు తెలిపారు. ప్రియాంకా గాంధీ, దీపేందర్ హూడాలపై పోలీసులు వ్యవహరించిన తీరును కాంగ్రెస్ ఖండిరచింది. ఆమె అరెస్టును నిరసిస్తూ ఆందోళనకారులు ఆ గెస్ట్ హౌజ్ ముందు ధర్నా చేపట్టారు.