Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బంగాళాఖాతంలో భూకంపం

రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు

అమరావతి : బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా మంగళవారం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.1గా నమోదయినట్టు జాతీయ భూకంపన విజ్ఞాన కేంద్రం వెల్లడిరచింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ తీర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలుకు 257 కిలోమీటర్ల దూరంలో ని సముద్రగర్భంలో ఈ భూకంపం నమోదు అయినట్లు కేంద్రం తెలిపింది. సముద్ర గర్భం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. కాకినాడ నుంచి ఆగ్నేయంగా 296 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుంచి 312 కిలోమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురానికి 260 కిలోమీటర్ల దూరంలోను భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. 2 సెకన్ల పాటు భూ ప్రకంపనలు నమోదు అయినట్టు శాస్తవ్రేత్తలు వెల్లడిరచారు. ప్రకంపనల స్థాయి తక్కువగా ఉండటంతో ఎలాంటి సునామి హెచ్చరికలు జారీ చేయలేదని ఎన్జీఆర్‌ఐ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img