కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
బయటి వ్యక్తులు ఎవరూ పార్లమెంట్లో అడుగుపెట్టలేదని, ప్రతిపక్షాలు కావాలనే డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. బుధవారం పార్లమెంట్లోకి బయటి వ్యక్తులు వచ్చి మహిళా ఎంపీలపై దాడికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షనేతలు చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. సభలో ప్రతిపక్షాల తీరు సమావేశాలకు భంగం కలిగించే విధంగా ఉందని, చైర్మన్ గౌరవానికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించారని అన్నారు. 12 మంది మహిళా మార్షల్స్, 18 మంది పురుష మార్షల్స్ మాత్రమే సభలో ఉన్నారని, బయటి వ్యక్తులెవరికీ పార్లమెట్లోకి అనుమతి ఉండదన్నారు. కాగా, మహిళా ఎంపీలపై సుమారు 40 మంది దాడికి పాల్పడ్డారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే బుధవారం ఆరోపించారు.