సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లతో హైదరాబాదులోని బస్ స్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడతాయి.ఈ క్రమంలో సొంతూరికి వెళ్లే ప్రయాణికులతో ప్రస్తుతం నగరంలో ప్రయాణాల సందడి కనిపిస్తుంది. ఇప్పటికే జోరుగా ప్రయాణాలు కనిపిస్తుండగా, మరో రెండు రోజుల్లో ప్రయాణాల హడావిడి పీక్స్కు చేరుతుందని తెలుస్తుంది. సంక్రాంతి పండుగ రద్దీ.. బస్సులు, రైళ్ళలో విపరీతమైన రద్దీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే రోజువారి సర్వీసులలో సీట్లన్నీ నిండిపోవడంతో, ప్రత్యేక బస్సుల్లో కూడా రద్దీ కొనసాగుతోంది. ఆర్టీసీ పెట్టిన ప్రత్యేక బస్సులు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులలో సైతం ప్రస్తుతం రద్దీ కనిపిస్తుంది. హైదరాబాద్ నుండి 4233 ప్రత్యేక బస్సులను పెట్టిన ఆర్టీసీ హైదరాబాద్ నుండి విజయవాడకు, హైదరాబాద్ నుండి వరంగల్ కు, హైదరాబాద్ నుండి నిజామాబాద్కు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ వయా కర్నూలు వయా బెంగళూరుకు, హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు వెళుతున్న బస్సులలో విపరీతమైన రద్దీ ఉంది. హైదరాబాద్ నుంచి వేరు వేరు ప్రాంతాలకు వెళ్లే 3500 బస్సులకు అదనంగా మరో 4233 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ప్రస్తుతం నడుస్తున్న 500 బస్సులతో పాటుగా ప్రత్యేకంగా మరో 1850 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీల బాదుడు, ప్రత్యేక రైళ్ళలోనూ కొనసాగుతున్న రద్దీ ప్రతి రోజూ నాలుగు వేల నుండి ఐదు వేల బస్సులు నడపడానికి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా కుస్తీ పడుతున్నారు. ఇక సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో ప్రైవేటు బస్సుల వాళ్ళు ఛార్జీలను అమాంతం పెంచేశారు. ఆర్టీసీ బస్సులలో ఛార్జీలు యధాతథంగా ఉండగా, ప్రైవేటు బస్సుల్లో మాత్రం రెండు మూడిరతలు చార్జీలను పెంచి వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సంక్రాంతికి 18 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసి నడిపిస్తుంది రైల్వే శాఖ. ఈనెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో తదనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంది.