Friday, April 19, 2024
Friday, April 19, 2024

బీజేపీకి కాంగ్రెస్‌కు మధ్య తేడా ఇది

దిగ్విజయ్‌ సింగ్‌
బీజేపీకి కాంగ్రెస్‌కు మధ్య ఉన్న తేడా అర్హతలేని కుమారుడు/అర్హత కలిగిన కుమారుడికి ఉన్న తేడా అని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. గురువారం మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వ సంస్థల్ని, ఆస్తుల్ని అమ్మడానికి ప్రభుత్వం నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను ప్రకటించింది. 1947-2014 వరకు కాంగ్రెస్‌ పార్టీ దేశంలో చేసిన అభివృద్ధిని మొత్తం అమ్మకానికి పెట్టారు. బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీకి మధ్య ఉన్న తేడా ఇది’ అని అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ పాలనలో ఏమీ చేయలేదని ప్రధాని మోదీ చెబుతున్నారని, అలా అయితే తాజా స్కీమ్‌తో మోదీ అమ్మాలనుకుంటున్నవి ఎక్కడి నుంచి వచ్చాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img