Friday, April 19, 2024
Friday, April 19, 2024

బీసీల సభ సాక్షిగా చెప్పింది నిజమే.. చంద్రబాబు

ట్విట్టర్‌ వేదికగా సీఎం జగన్‌పై సెటైర్లు
వైఎస్సార్‌సీపీ బుధవారం విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ మహాసభ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చారు. ‘నా వెనుక నలుగురు ఉన్నారు అని బీసీల సభ సాక్షిగా నిన్న సీఎం జగన్‌ రెడ్డి చెప్పిన మాట నిజం. అవును నలుగురే ఉన్నారు. వాళ్లే సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి’అంటూ ఎద్దేవా చేశారు.
ఇటు చంద్రబాబు మళ్లీ జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. ఇవాళ పొన్నూరులో జరిగే ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రోడ్‌షోలు, బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే 9న చీరాల, 10న బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. అలాగే ఈ నెల 10న ఉదయం ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎస్సీ నేతలు, విద్యార్థులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అదే రోజు స్టూవర్టుపురంలో గిరిజన మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు చంద్రబాబు చిత్తూరు జిల్లాలో జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంపై స్పందించారు. పూతలపట్టు మండలంలో శుభకార్యానికి వెళుతూ ట్రాక్టర్‌ బోల్తా పడిన దుర్ఘటనలో మహిళలు, చిన్నారులతో సహా ఆరుగురు మృతిచెందిన వార్త కలచివేసింది అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు.గుంటూరులో హత్యకు గురైన వైద్య విద్యార్థిని తపస్వి తల్లిదండ్రులను పరామర్శించినట్లు చంద్రబాబు తెలిపారు. కుమార్తె మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు సీతారత్నం, పి.మహేష్‌ కుమార్‌లతో ఫోన్‌ లో మాట్లాడి వారిని ఓదార్చానని.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img