కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. పేలుడు సంభవించి ముగ్గురు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని విక్టోరియా హాస్పిటల్కు స్థానికులు తరలించారు. చుట్టుపక్కల భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. నగరంలోని చామరాజపేటలో ఓ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో ఈ పేలుడు జరిగిందని సమాచారం. సమాచారం తెలియగానే చామరాజుపేట్ పోలీసులు, వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ సంజీవ్ పటేల్ ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.పేలుడుకు కారణాలేంటో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పేలుడు తీవ్రతకు డెడ్బాడీస్ 100 మీటర్ల దూరానికి ఎగిరి పడటమే కాకుండా.. అక్కడున్న వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. వెస్ట్జోన్ కమిషనర్ సంజీవ్ పటేల్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఓ గోడౌన్ నుంచి బాణసంచాను తరలిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తున్నది. దీనిపై కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు