Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బైజూస్‌ సీఈవో కార్యాలయాలపై ఈడీ దాడులు

  • ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌ బైజు ఇల్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఈరోజు బెంగ‌ళూరు, ఢిల్లీ ప్ర‌ధాన కార్యాల‌యాల్లో ఈ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన కంపెనీ థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు జరిపింది. ఫెమా చట్టం కింద నమోదైన కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది.ఈ తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, డిజిటల్‌ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి నిధులను స్వీకరించినట్లు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఫిర్యాదులు అందాయని ఈడీ వెల్లడించింది. దీనిపై పలుమార్లు రవీంద్రన్‌కు సమన్లు జారీ చేసిప్పటికీ ఆయన విచారణకు హాజరుకాక‌పోవ‌డంతో ఆయన ఇల్లు, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిపినట్లు ఈడీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img