ప్రధాని నరేంద్ర మోదీ
నూతన విద్యా విధానం భవిష్యత్ భారతానికి ఆధారభూతంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నూతన జాతీయ విద్యా విధానా’నికి ఏడాది పూర్తైన సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. జాతి నిర్మాణంలో జాతీయ నూతన విద్యా విధానం ప్రముఖ పాత్ర పోషిస్తుందని మోదీ పేర్కొన్నారు. యువతకు సదావకాశాలు లభించడంతో పాటు తమ కలలకు తామే ఓ రోడ్ మ్యాప్ను రూపొందించేందుకు వీలుగా ఈ నూతన విద్యా విధానం ఉంటుందన్నారు.యువతకు ఎలాంటి విద్యను అందిస్తున్నామన్న అంశంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత స్వేచ్ఛను కోరుకుంటున్నారని, పది మందిలో గుర్తింపు రావాలని కోరుకుంటుందని, అందుకు ఈ నూతన విద్యా విధానం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు.