కాషాయ పార్టీ నేతలు దేశాన్ని ఓ భౌగోళిక ప్రాంతంగా చెబితే తాము భారత్ అంటే ప్రజలు వారి మధ్య సంబంధాలని చెబుతామని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అన్నారు. ఇవాళ ఉదయం కోజికోడ్, మలప్పురంలో ఒకరోజు పర్యటన కోసం రాహుల్గాంధీ ఇవాళ కేరళలో వెళ్లారు. మలప్పురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ దేశంలో హిందూ, ముస్లింల మధ్య, సిక్కుల మధ్య..తమిళ్, హిందీ, ఉర్దూ, బెంగాలీ వంటి వివిధ భాషల మధ్య సంబంధం చూడాలని అన్నారు.ఈ సంబంధాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదే తన ఆవేదనని ఆయన పేర్కొన్నారు.భారతీయుల మధ్య బంధాలను తెంచడం ఆయన పనైతే దేశ ప్రజల మధ్య సంబంధాలను పటిష్టం చేయడం తన బాధ్యతని వ్యాఖ్యానించారు.