భారత్ పూర్తిగా దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రధాని నరేంద్ర మోదీ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం కొచ్చిన్ షిప్యార్డ్లో జరిగింది. భారత్ ఇప్పటివరకు నిర్మించిన అతి పెద్ద నౌక ఇదే కావడం విశేషం. ఈ నౌక నిర్మాణానికి సుమారు రూ.20,000కోట్లను భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దీంతోపాటు భారత నౌకా దళానికి సరికొత్త గుర్తును కూడా ఆవిష్కరించారు. కొచ్చిన్ షిప్యార్డ్లో ఆటోమేషన్ సౌకర్యాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త నౌకాదళ చిహ్నం సెయింట్ జార్జ్ శిలువను ఖండంలో త్రివర్ణ పతాకంతో (జెండా ఎగువన ఎడమ మూలలో) మోసుకెళ్ళే ప్రస్తుత చిహ్నం స్థానంలో ఉంటుంది.