భారత్కు ఎవరైనా హాని తలపెట్టాలని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చైనాకు తాజాగా పరోక్ష హెచ్చరికలు చేశారు. భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినంగానే వుంటామని హెచ్చరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా టాప్లో ఉందని తెలిపారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత-అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే కొన్నేళ్లలో భారత్ మూడు అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారడాన్ని ఎవరూ ఆపలేరని రాజ్నాథ్ చెప్పారు. భారత్ దౌత్యపరంగా ఓ దేశంతో సత్సంబంధాలను కొనసాగించినంత మాత్రాన.. ఇతర దేశంతో సరైన దౌత్య సంబంధాలను కొనసాగించదన్న అర్థం కాదని, అలాంటి దౌత్య నీతిని భారత్ ఎప్పుడూ అవలంబించదని అమెరికాకు పరోక్షంగా చురకలంటించారు. భారత్ ఎప్పుడూ విన్-విన్ కాన్సెప్ట్ ప్రకారమే దౌత్యాన్ని నెరుపుతుందని తేల్చిచెప్పారు.