ముంబైలో తొలి కేసు నమోదు
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతోందని అనుకుంటున్న వేళ కొత్త రకం వేరియంట్లు కలవరపెడుతున్నాయి. ఇటీవల బ్రిటన్లో వెలుగుచూసిన ‘ఎక్స్ఈ’ భారత్లోనూ బయటపడిరది. ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది. తాజాగా 230 శాంపిల్స్ పరీక్షించగా 228 మందికి ఒమిక్రాన్, ఒకరికి ఎక్స్ఈ, ఒకరికి కప్పా వేరియంట్ సోకినట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బ్రిటన్లో జనవరి 19న తొలి ఎక్స్ఈ కేసు నమోదైంది.