Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారత్‌లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వాడకం.. టాప్‌లో అజిత్రోమైసిన్‌

తేల్చి చెప్పిన లాన్సెట్‌ రిపోర్ట్‌
కాస్తంత జలుబో, జ్వరమో రాగానే వెంటనే ట్యాబ్లెట్స్‌ వేసుకుంటాం. మామూలువి కూడా కాదు. ఏకంగా యాంటీ బయాటిక్స్‌ను వాడేస్తున్నాం. వాటి వల్ల వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్‌ ఏంటని ఆలోచించకుండా మితిమీరి వాడుతున్నారంతా. ఇప్పుడిదే విషయాన్ని లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడిరచింది. కొవిడ్‌ తరవాత మందుల వినియోగం బాగా పెరిగింది. వీటిలో ఎక్కువగా యాంటీ బయాటిక్స్‌ ఉంటున్నాయని లాన్సెట్‌ రిపోర్ట్‌ తేల్చి చెప్పింది. మరో కీలకమైన అంశం ఏంటంటే..భారత్‌లోనే యాంటీబయాటిక్స్‌ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా అజిత్రోమైసిన్‌ వాడకం బాగా పెరిగిందని తెలిపింది. కొన్ని యాంటీబయాటిక్స్‌ను సెంట్రల్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌ అప్రూవల్‌ కూడా లేదని స్పష్టం చేసింది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి…విధానాల్లో సంస్కరణలు తీసుకురావాలని సూచించింది లాన్సెట్‌ రిపోర్ట్‌. సెప్టెంబర్‌ 1వ తేదీన విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడిరచింది. అప్రూవల్‌ లేని, నాసిరకమైన యాంటీబయాటిక్స్‌ను విపరీతంగా వినియోగించటం చాలా ప్రమాదకరమని, భారతీయులు క్రమంగా యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ కోల్పోతారని హెచ్చరించింది. కేంద్రం, రాష్ట్రాల వారీగా చూసుకుంటే డ్రగ్‌ రెగ్యులేటరీ అధికారాలు చాలా భిన్నంగా ఉంటున్నాయని తెలిపింది. విక్రయాలు, వినియోగంలో గందరగోళానికి ఇది కారణమవుతోందని లాన్సెట్‌ వెల్లడిరచింది.
అజిత్రోమైసిన్‌ వినియోగమే అధికం..
‘‘తలసరి వినియోగంలో చూసుకుంటే మిగతా దేశాల కన్నా భారత్‌లో యాంటీబయాటిక్స్‌ వినియోగం తక్కువగానే ఉంది. కానీ…మొత్తంగా చూసుకుంటే అన్ని దేశాల్లో కన్నా యాంటీబయాటిక్స్‌ విక్రయాలు, వినియోగం భారత్‌లో అధికంగానే ఉంటోంది. ఈ వాడకాన్ని కాస్త తగ్గించుకోవటమే మంచిది’’ అని లాన్సెట్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఢల్లీిలోని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌కు చెందిన ఆశ్నా మెహతా ఈ లెక్కలు సేకరించేందుకు సహకరించినట్టు వివరించింది. దేశవ్యాప్తంగా 9,000 మంది సేల్స్‌ రిప్రజంటేటివ్స్‌ నుంచి వివరాలు సేకరించటంతో పాటు ఫార్మాట్రాక్‌ కంపెనీ ఇచ్చిన వివరాలనూ పరిశీలించింది. ఆ తరవాతే నివేదిక వెలువరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img