భారత్లో కోవిడ్ వల్ల 47.40 లక్షల మరణాలు సంభవించి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్లో తెలిపింది. అయితే గురువారం నాటికి 5.23 లక్షల మంది కొవిడ్తో మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడిరచింది. డబ్ల్యూహెచ్వో తాజా అంచనాలు మాత్రం అంతకు 9 రెట్లకు పైగా ఉండటం గమనార్హం. కాగా, కోవిడ్ మరణాల లెక్కింపులో డబ్ల్యూహెచ్వో అనుసరిస్తున్న గణిత విధానాలపై భారత్ ఎప్పటికప్పడు అభ్యంతరాలు చెబుతూనే ఉన్నా.. పట్టించుకోకుండా ఈ అంచనాలను విడుదల చేయడమేమిటని ప్రశ్నించింది. భారత్ విషయంలో కరోనా మరణాల అంచనాలను రూపొందించే డేటా సేకరణ గణాంకపరంగా అసంబద్ధమైందని.. అశాస్త్రీయమైన ఈ నివేదిక సందేహాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది.
భారత్లో సంభవించిన మరణాలపై డబ్ల్యూహెచ్వో ఇచ్చిన నివేదికలో ఎటువంటి లాజిక్ కానీ వాస్తవం కానీ లేదని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా అన్నారు. ఆ నివేదిక ఆందోళన కలిగించేలా ఉందన్నారు. మరణాల విషయంలో ఉంటే 20 శాతం తేడా ఉంటుందేమో అని ఆయన అన్నారు.దేశంలో మరణ ద్రువీకరణ విధానం పటిష్టంగా ఉందని, వైరస్ సంబంధింత మరణాలన్నీ నమోదు అయినట్లు ఆయన వెల్లడిరచారు. డబ్ల్యూహెచ్వో రిపోర్ట్ తప్పుడుగా ఉందని అరోరా అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కొంత ఆలస్యంగా కోవిడ్ మరణాలను రిపోర్ట్ చేస్తున్నాయని, భారత్ చాలా పెద్ద దేశమని, ఒకవేళ మరణాల నమోదు తప్పినా.. అది డబ్ల్యూహెచ్వో చెప్పినట్లు 10 శాతం తేడా ఉండదని అరోరా అన్నారు. ఇండియా ఇచ్చిన డేటాను డబ్ల్యూహెచ్వో పట్టించుకోలేదని, తన సొంత గణాంకాలనే అది నమ్ముకున్నట్లు ఆయన చెప్పారు.
అలాగే డబ్ల్యూహెచ్వో నివేదిక ఆమోదయోగ్యం కాదని, దురదృష్టకరమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా ఖండిరచారు. మరణాల విషయంలో భారత్ సమర్పించిన డేటాను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, డబ్ల్యూహెచ్ఓ మాత్రం తన నివేదికలో కరోనాకు ముందు, తర్వాత చోటుచేసుకున్న మరణాల సంఖ్యలో వ్యత్యాసం ఆధారంగా లెక్కించినట్టు స్పష్టం చేసింది. ‘‘ కోవిడ్-19తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానూ 1.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.. మహమ్మారి వల్ల ఆరోగ్య వ్యవస్థలపై అధిక భారం పడటంతో సకాలంలో చికిత్స అందుకోలేకపోయారు’’ అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అనేక దేశాలలో మరణాల పర్యవేక్షణకు ఇప్పటికీ సరైన వ్యవస్థలు అందుబాటులో లేవు, దీంతో అదనపు మరణాలను లెక్కించడానికి అవసరమైన డేటాను సేకరించలేకపోతున్నాయి కాబట్టి గణిత నమూనాను ఎంచుకున్నారని పేర్కొంది.2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ.. దాదాపు 14.9 మిలియన్ల మంది కోవిడ్ కారణంగా చనిపోయి ఉండొచ్చు.. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కరోనా బారిన పడి 13.3 మిలియన్ల నుంచి 16.6 మిలియన్ల వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్వో అంచనాకు వచ్చింది.