దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. . ఇప్పటి వరకు దేశంలో 781 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. వారిలో 241 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒమైక్రాన్ వేరియంట్ కేసుల్లో మొదటి స్థానంలో దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. మొదటి స్థానంలో దిల్లీ 238 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 167, గుజరాత్లో 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్థాన్లో 46, కర్ణాటకలో 34, తమిళనాడులో 34, హర్యానాలో 12, బెంగాల్లో 11 మధ్యప్రదేశ్లో 9 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దేశ రాజధాని ఢల్లీిలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 73 మందికి ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా.. మొత్తం కేసుల సంఖ్య 238కి పెరిగింది. మహారాష్ట్రలో 167 కేసులున్నాయి. మంగళవారం 11 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేయగా, 9,195 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. గడిచిన 24 గంటల్లో 302 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.48 కోట్లకు చేరగా, మరణాల సంఖ్య 4,80,592కి పెరిగింది. మంగళవారం 7,347 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.42 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 77,002గా ఉంది. యాక్టివ్ రేటు 0.68 శాతంగా ఉంది. ఇది గత 45 రోజులుగా 1 శాతం కంటే తక్కువగా ఉంది.పాజిటివిటీ రేటు 0.79 శాతం కాగా, గత 86 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా ఉంది. రికవరీ రేటు 98.40 శాతంగా కొనసాగుతోంది.