Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం..

ఫైనల్లో మెరిసిన తెలుగుతేజం పీవీ సింధు
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగుతేజం పీవీ సింధు స్వర్ణం గెలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్స్‌ లో సింధు అద్భుతంగా ఆడి కెనడాకు చెందిన మిచెల్లీ లీపై ఘనవిజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు 21-15, 21-13 తో అలవోకగా నెగ్గింది. బర్మింగ్‌ హామ్‌ లో జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ అంశంలో సింధుపై మొదటి నుంచి పసిడి ఆశలు ఉన్నాయి. ఆమె తప్పకుండా స్వర్ణం సాధిస్తుందని భారత శిబిరం నమ్మకం ఉంచింది. అటు అభిమానులు కూడా సింధు కామన్వెల్త్‌ స్వర్ణం అందుకోవాలని ఆకాంక్షించారు. అందరి అంచనాలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ సింధు కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విజేతగా అవతరించింది. కాగా, కామన్వెల్త్‌ క్రీడల్లో పీవీ సింధుకు ఇదే తొలి స్వర్ణం పతకం. ఈ పతకంతో బర్మింగ్‌ హామ్‌ క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య 56కి పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img