Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారత్‌ సహా 60కు పైగా దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్‌

ఈ నెల 21న డబ్ల్యూహెచ్‌వో అత్యవసర భేటీ
ఆఫ్రికా నుంచి పాశ్చాత్య దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్‌.. ఆలస్యంగా భారత్‌లోకి అడుగు పెట్టింది. కేరళ రాష్ట్రంలో దీని తొలి కేసు వెలుగు చూసింది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో దీన్ని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అంటు వ్యాధి ఇప్పటికే 63 దేశాలకు చేరిపోయింది. 63 దేశాల్లో ఇప్పటికి 9,000కు పైగా కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వారం మొదట్లోనే ప్రకటించింది. సౌదీ అరేబియా కూడా గురువారమే మొదటి కేసును గుర్తించింది. దీంతో బాధిత దేశాల సంఖ్య పెరగనుంది. ఈ క్రమంలో జులై 21న ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ భేటీ కానుంది. ఈ వ్యాధికి సంబంధించి తాజా పరిస్థితులను సమీక్షించనుంది. ఈ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలను విశ్లేషించనుంది. అనంతరం ప్రపంచ దేశాలకు సూచనలు చేయనుంది. ఇప్పటి వరకు వెయ్యికి పైగా కేసులు అమెరికాలోనే వచ్చాయి. అది కూడా పురుషుల్లోనే ఎక్కువ కేసులు వచ్చాయి. వారిలోనూ స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. అయితే, ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img