ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయుల్ని కాబూల్ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.వైమానిక దళానికి చెందిన సీ-130జే ప్రత్యేక రవాణా విమానం ఇప్పటికే బయలుదేరింది. దాంట్లో 85 మంది భారతీయులు ఉన్నారు.ప్రస్తుతం ఆ విమానం రీఫ్యుయలింగ్ కోసం తజకిస్తాన్లో ల్యాండ్ అయినట్లు సమాచారం. అలాగే మరో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. వైమానిక దళం సీ-17 రవాణా విమానాన్ని సిద్ధంగా ఉంచింది. సీ-17 విమానంలో సుమారు 250 మంది భారతీయుల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కావాల్సినంత మంది భారతీయులు కాబూల్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఐఏఎఫ్ విమానాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఎయిర్ ఇండియా విమానాలను ఆపరేట్ చేయడం కష్టంగా ఉన్న నేపథ్యంలో కేవలం వైమానిక దళ విమానాలను నడపనున్నారు. కాగా కాగా ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు దరఖాస్తు చేసుకున్న వీసాలను కూడా కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది.