అమెరికాలో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్.. నలుగురి మృతదేహాలు లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో రెండు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన భారత సంతతి కుటుంబం ఘటన చివరకు విషాదాంతమైంది.అపహరణకు గురైన నలుగురి మృతదేహాలను గుర్తించారు.కాలిఫోర్నియాలోని ఓ పండ్ల తోటలో ఆ మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ అయిన వారిలో 8 నెలల చిన్నారి ఆరూహి ధేరితో పాటు ఆమె పేరెంట్స్ జస్లీన్ కౌర్, జస్దీప్ సింగ్, అమన్దీప్ సింగ్ ఉన్నారు. నార్త్ కాలిఫోర్నియాలోని మెర్సెడ్ కౌంటీలో ఉన్న ఓ బిజినెస్ సెంటర్ నుంచి ఆ నలుగుర్నీ కిడ్నాప్ చేశారు.ఇండియానా రోడ్, హట్చిన్సన్ రోడ్ సమీపంలో ఉన్న ఓ తోటలో ఆ నలుగురి మృతదేహాలు లభ్యమైనట్లు మెర్సిడ్ కౌంటీ పోలీసు షరీఫ్ వెర్న్ వార్నకీ తెలిపారు. ఆ ఫామ్లో పనిచేస్తున్న ఓ వర్కర్ మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. బుధవారం రోజున కిడ్నాప్కు సంబంధించిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. బిజినెస్ సెంటర్ నుంచి జస్దీప్, అమన్దీప్లు చేతులు కట్టేసి కిడ్నాపర్లు తీసుకువచ్చారు. కొన్ని సెకన్ల తర్వాత చిన్నారి అరూహితో పాటు ఆమె తల్లిని కూడా బిల్డింగ్ నుంచి వచ్చారు. ఫ్యామిలీకి చెందిన నలుగుర్ని ఓ ట్రక్కులో ఎక్కించి తీసుకువెళ్లారు. ఎన్ఆర్ఐ ఫ్యామిలీ కిడ్నాప్ అయిన ఒక రోజు తర్వాత జీసెస్ మాన్యువల్ సాల్గడోను కస్టడీలోకి తీసుకున్నారు. నేరానికి పాల్పడినట్లు సాల్గడో తమ కుటుంబానికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.