Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

భారీగా పెరిగిన కరోనా మరణాలు

24 గంటల్లో 666 మంది మృతి
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 16,326 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 666 మంది కరోనాతో మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మరణాల సంఖ్యను సవరించడంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క కేరళలోనే నిన్న 563 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,73,728గా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.16 శాతంగా ఉంది. మార్చి 2020 నుంచి ఇదే అత్యధికం. గత 24 గంటల్లో రికవరీ అయిన వారి సంఖ్య 17,677గా ఉంది. ఇక కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 101.30 కోట్ల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img