Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

భారీగా పెరిగిన కరోనా మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు పెరగడంతోపాటు కరోనా మరణాల సంఖ్య పది రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 18,52,140 మందిని పరీక్షించగా కొత్తగా 42,015 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,16,337కి చేరింది. ఇందులో 4,07,170 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా 36,977 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కావడంతో.. రికవరీల సంఖ్య 3,03,90,687కి చేరింది.నిన్న 3998 మంది కరోనాతో మృతి చెందారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోని 3,509 మంది కరోనాతో మరణించారు. మిగిలిన దేశమంతా 489 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,18,480 చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 41,54,72,455 వ్యాక్సినేషన్‌ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img