Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భోగి మంటల్లో జీవో 1 కాపీలు..చంద్రబాబు నిరసన

నారావారిపల్లెలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భోగి వేడుకలు నిర్వహించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలు ఈ వేడుకల్లో భారీగా పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జీవో 1 కాపీలను భోగి మంటల్లో వేసి జగన్‌ సర్కారుకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసన తెలిపారు. పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేశామన్నారు. ప్రజావేదిక విధ్వసంతో పాలన మొదలుపెట్టిన సీఎం జగన్‌..ప్రజలపై పన్నులు, ఛార్జీల మోత మోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలను భోగి మంటల్లో వేసి కాల్చామని..సైకో పాలన పోవాలని ఈ సందర్భంగా కోరుకున్నట్లు చంద్రబాబు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img