మణిపూర్లోని కాంగ్పోక్సీ జిల్లా బి గమ్మోమ్ ప్రాంతంలో కుకీ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రామ పెద్ద సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.మృతుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిలిటెంట్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు.