Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మరింత ముదిరిన మహారాష్ట్ర సంక్షోభం..

గుజరాత్‌ నుంచి అసోంకి రెబల్‌ ఎమ్మెల్యేలు
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం కొనసాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను బుజ్జగించడానికి శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిరిగి బీజేపీతో కలవాలని ఆయన షరతు విధించారు. ఈ నేపథ్యంలో క్యాంపును గుజరాత్‌ నుంచి అసోంకి తరలించారు. సంకీర్ణ పార్టీలూ కూడా అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కారణమైన రెబల్‌ నేత, మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తన అనుచర వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపును సూరత్‌ నుంచి గువహటికి మార్చారు. సూరత్‌ నుంచి బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో వీరంతా గువహటికి చేరుకున్నారు. సూరత్‌లోని లే మెరిడియన్‌ హోటల్‌లో బస చేసిన శివసేన, స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లారు. అంతకు ముందు సూరత్‌ విమానాశ్రయంలో షిండే మీడియాతో మాట్లాడుతూ.. తన వెంట రెండిరట మూడొంతుల మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ‘‘మేం బాలాసాహెబ్‌ ఠాక్రేకు చెందిన శివసేనను విడిచిపెట్టలేదు…మేం బాలాసాహెబ్‌ హిందుత్వాను అనుసరిస్తున్నాం.. దానిని మరింత ముందుకు తీసుకువెళతాం’’ అని ఏక్‌నాథ్‌ షిండే వ్యాఖ్యానించారు. తిరుగుబాటుదారులతో సూరత్‌ హోటల్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పంపిన శివసేన నేతలు మిలింద్‌ నార్వేకర్‌, రవీంద్ర ఫాటక్‌ చర్చలు జరిపిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.
కాంగ్రెస్‌, ఎన్సీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు శివసేనపై షిండే తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉద్ధవ్‌ను డిమాండ్‌ చేశారు. అలా అయితే, వెనక్కు వస్తానని, లేనిపక్షంలో నిర్ణయం మార్చుకోనని షిండే ఉద్ఘాటించారు. అయితే, ఉద్ధవ్‌ మాత్రం దీనిని తోసిపుచ్చారు. ఇక, శాసనసభలో తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తన ఐదో అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి షిండే సోమవారం అర్థరాత్రి సూరత్‌లోని హోటల్‌కు చేరుకున్నారు. అధికార కూటమి నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు అనుమానిస్తున్నారు. రెబల్‌ నేతలకు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేందర్‌ ఫడ్నవీస్‌ సహకరిస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img