Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మరోరోజు 8 వేల పైనే కరోనా కేసులు

3.24 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలుగుతోంది.దేశంలో కొత్తగా 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. ఇందులో 4,26,57,335 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,771 మంది మరణించారు. మరో 47,995 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 10 మంది మరణించగా, 4,592 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. దేశంలో రికవరీ రేటు 98.68 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 11,77,146 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. మరోవైపు నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 4,309 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2,946 కేసులు వచ్చాయి. కర్ణాటకలో 463, హర్యానాలో 304 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img