రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు బుధవారం మరోసారి పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢల్లీిలో లీటరు పెట్రోల్ రూ.107.94,డీజిల్ లీటరు ధర రూ.96.67కి పెరిగాయి.దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబైలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.113.80, డీజిల్ లీటరుకు రూ. 104.75 కు పెరిగింది. చెన్నైలో పెట్రోల్ ధరలు లీటరు మార్కు రూ. 105కి చేరింది. చెన్నైలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.104.83 కు పెరిగింది.హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 36 పైసలు పెరిగి రూ.112.27కు చేరింది. డీజిల్ ధర లీటరుపై 38 పైసలు పెరిగి రూ.105.46కు చేరింది.