రెండు రోజులు విరామం ఇచ్చిన చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.104.79కు చేరగా, డీజిల్ ధర రూ.93.52కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్పై 34 పైసలు పెరగడంతో రూ.110.75కు, డీజిల్పై 37 పైసలు అధికమవడంతో రూ.101.40కు చేరాయి. చెన్నైలో పెట్రోల్ రూ.102.10, డీజిల్ రూ.97.93, కోల్కతాలో పెట్రోల్ రూ.105.44, డీజిల్ రూ.96.63, బెంగళూరులో పెట్రోల్ రూ.108.44, డీజిల్ రూ.99.26కు చేరాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసలు పెరిగాయి. దీంతో పెట్రోల్ ధర రూ.109కి చేరగా, డీజిల్ రూ.102.04కు పెరిగింది.